బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / తిరుమలకు చేరుకున్న 25 ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలకు చేరుకున్న 25 ఎలక్ట్రిక్ బస్సులు
AP TODAY
AP TODAY

2 days ago

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పర్యావరణహిత ప్రజా రవాణాకు మరో అడుగు పడింది. పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలకు చేరుకున్నాయి.

భక్తుల రాకపోకలను మరింత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించనున్నట్లు సమాచారం.

ఈ బస్సులతో పాటు వాటిని నడిపే డ్రైవర్లకు సంబంధించిన ఏర్పాట్లు, ఛార్జింగ్ మౌలిక వసతులకు కూడా సహకారం అందించినట్లు సమాచారం.

తిరుమలలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ప్రజా రవాణాలో ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడే అవకాశం ఉంది.

తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఆ దిశలో మరో ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.

భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ బస్సులను అవసరమైన మార్గాల్లో వినియోగించనున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement