మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / మీరాలం చెరువు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ ఫోకస్.. క్రేన్‌పై నుంచి సస్పెన్షన్ బ్రిడ్జి పరిశీలన!
మీరాలం చెరువు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ ఫోకస్.. క్రేన్‌పై నుంచి సస్పెన్షన్ బ్రిడ్జి పరిశీలన!
AP TODAY
AP TODAY

August 27, 2026

హైదరాబాద్‌లోని మీరాలం చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

పనుల తీరును మరింత దగ్గరగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి భారీ క్రేన్‌పైకి ఎక్కి నిర్మాణ పనులను పర్యవేక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన సీఎం, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మీరాలం చెరువులోకి ఎలాంటి పరిస్థితుల్లోనూ మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే మీరాలం నుంచి మూసీ నదిలోకి వరద నీరు సులభంగా వెళ్లేలా నాలాను విస్తరించాలని సూచించారు.

చెరువులో ఉన్న ఐల్యాండ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంతో పాటు, పర్యాటకులను ఆకర్షించేలా వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు అనువైన డిజైన్‌ను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మీరాలం చెరువును భవిష్యత్తులో హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement