బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్.. ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపు
పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్.. ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపు
AP TODAY
AP TODAY

5 days ago

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

కక్షిదారులకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపు

అనకాపల్లి, సెప్టెంబర్ 10: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ కక్షిదారులకు పిలుపునిచ్చారు.

ఈ నెల 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్పీ ఈ మేరకు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల్లో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను స్నేహపూర్వక వాతావరణంలో పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.

ఏ కేసులను పరిష్కరించుకోవచ్చు?

జాతీయ లోక్ అదాలత్‌లో పలు రకాల రాజీపడదగ్గ వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు: చిన్నపాటి ఘర్షణలు, పరస్పర ఫిర్యాదులు, చట్టపరంగా రాజీకి అవకాశం ఉన్న కేసులు.

ట్రాఫిక్ చలాన్లు: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లు, వాహన తనిఖీలకు సంబంధించిన కేసులు.

సివిల్, భూ వివాదాలు: సరిహద్దు తగాదాలు, ఆస్తి విభజన సమస్యలు, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు తదితరాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు: భార్యాభర్తల మధ్య వివాదాలు, మెయింటెనెన్స్ పిటిషన్లు, ఎన్‌ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులు కూడా అర్హతను బట్టి పరిష్కరించుకోవచ్చు.

సమయం, ధనం ఆదా

లోక్ అదాలత్ ద్వారా సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు ముగింపు పలికి సమయం, ధనాన్ని ఆదా చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. కోర్టుల చుట్టూ పదేపదే తిరగాల్సిన అవసరం లేకుండా పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కారం లభించడం వల్ల ఎవరికీ ఓటమి ఉండదని, తద్వారా పరస్పర శత్రుత్వం తొలగి సత్సంబంధాలు కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

శాశ్వత పరిష్కారానికి అవకాశం

లోక్ అదాలత్‌లో పరస్పర అంగీకారంతో ఇచ్చే అవార్డు/తీర్పు తుది పరిష్కారంగా ఉంటుందని, సాధారణంగా దానిపై అప్పీల్‌కు అవకాశం ఉండదని జిల్లా పోలీసులు తెలిపారు. ఇది సివిల్ కోర్టు డిక్రీతో సమానమైన చట్టబద్ధతను కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలి

తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే కక్షిదారులు తక్షణమే సమీప పోలీస్ స్టేషన్, న్యాయవాదులు లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యాలయాన్ని సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు.

వివాద రహిత, ప్రశాంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

– జిల్లా పోలీసు కార్యాలయం, అనకాపల్లి

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement