బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / వినాయక ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి.. డీజేలకు నో.. రాత్రి 10 తర్వాత మైక్‌లు బంద్: ఓడీసీ ఎస్‌ఐ
వినాయక ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి.. డీజేలకు నో.. రాత్రి 10 తర్వాత మైక్‌లు బంద్: ఓడీసీ ఎస్‌ఐ
AP TODAY
AP TODAY

6 days ago

ఓబుళదేవర చెరువు: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలు, సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఓబుళదేవర చెరువు ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి మండల ప్రజలకు సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

వినాయక విగ్రహాల ఏర్పాటు, ఉత్సవ కార్యక్రమాలకు మండల పరిధిలో మూడు రోజుల పాటు మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఉత్సవాల సమయంలో రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక శబ్దంతో కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా డీజేలకు పూర్తిగా అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇతరుల మనోభావాలను గౌరవించాలి

వినాయక ఉత్సవాల సందర్భంగా ఇతర మతాలు, వర్గాలు, వ్యక్తుల మనోభావాలను కించపరిచేలా పాటలు, నినాదాలు లేదా వ్యాఖ్యలు చేయరాదని ఎస్‌ఐ సూచించారు.

ఉత్సవాల పేరుతో గొడవలు, వాగ్వాదాలు, దాడులకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలే తప్ప.. ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించవద్దని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు

వినాయక ఊరేగింపుల్లో మద్యం సేవించి పాల్గొనడం, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధం అని ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు.

ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

మండపాల వద్ద భద్రతా చర్యలు

వినాయక మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఐ సూచించారు.

విద్యుత్ వైర్లు, జనరేటర్లు, అలంకరణ సామగ్రి విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిన్నపిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

వినాయక చవితి వేడుకలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించి పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.

“భక్తితో పండుగ చేసుకుందాం.. శాంతి భద్రతలను కాపాడుకుందాం. ఓడీసీ మండలాన్ని శాంతియుత మండలంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి” అని ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement